Saturday

పేదప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్




ప్రతీ పేద విద్యార్ధి దివంగత నేత వైఎస్‌ఆర్‌ను గుండెల్లో పెట్టుకొన్నారని యువనేత జగన్‌ అన్నారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర కొనసాగిస్తున్న ఆయన ఒంగోలు రాంనగర్‌ సెంటర్‌లో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. తన తండ్రి తనకు అతిపెద్ద కుటుంబాన్ని ఇచ్చారని చెప్పారు. తనపై అభిమానం చూపుతున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. 

పేద ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న మహానేత వైఎస్‌ అని కొనియాడారు. అంతకు ముందు ఒంగోలు మహాత్మాగాంధీ సెంటర్‌లో బాపూజీ విగ్రహానికి , కలెక్టరేట్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి జగన్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

0 comments:

Post a Comment