Friday

చంద్రబాబుపై గిరిజన మహిళల ఆగ్రహం


రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో మైనింగ్'కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబుపై వారు తిరగబడ్డారు. మహిళలు గట్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన చంద్రబాబు ఒక మహిళపై చేయి చేసుకోబోయారు. గిరిజన పల్లెలలో రాజకీయాలు చేయవద్దని, వెళ్లిపొమ్మని వారు ఎదురు తిరిగారు. మైనింగ్ వల్ల తమకు ఉపాధి దొరుకుతుందని వారు చెప్పారు. ఊరు నాశనం చేయడానికి వచ్చారని గిరిజన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

0 comments:

Post a Comment