Friday

తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజలు మద్దతివ్వాలి: జగన్


దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు తనకు మద్దతివ్వాలని కడప ఎంపీ జగన్మోహన రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు పూర్తి కావాల్సి వున్నాయన్నారు. 
తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ.. ప్రజాసేవలోనే తాను కొనసాగుతానని జగన్ వెల్లడించారు. తన తండ్రి, ప్రియతమ నేత తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయినప్పటికీ ఒక పెద్ద కుటుంబాన్ని ప్రజల రూపంలో వదిలి వెళ్ళారని జగన్ అన్నారు. 
కాగా.. నెల్లూరు జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్ర శుక్రవారంతో మూడో రోజుకు చేరుకుంది. రెండో రోజైన గురువారం వై.ఎస్. జగన్ నెల్లూరులోని 15 చోట్ల వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. మన్నంగిదిబ్బ, ముసునూరు వంటి తదితర గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు.

0 comments:

Post a Comment