Sunday

జగన్ సొంత పార్టీ పెట్టే ప్రసక్తే లేదు: ఆదినారాయణ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు, కడప ఎంపీ జగన్మోహన రెడ్డి కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని జగన్ వీడేది లేదని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఓదార్పు యాత్ర యధాతథంగా కొనసాగుతుందని, యాత్రపై అధిష్టానం ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానవర్గం జగన్‌పై చిన్నచూపు చూస్తోందని అందుకే వైఎస్. జగన్ త్వరలో పార్టీ పెట్టనున్నట్లు వస్తున్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా అధిష్టానం దిగిరాని నేపధ్యంలో జగన్ వైఎస్సార్ వర్ధంతి రోజు కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని జగన్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టేంత సాహసం ఆనాడు తండ్రి రాజశేఖరరెడ్డే చేయనప్పుడు ఇంత చిన్న పిల్లాడు ఎలా చేస్తాడు? అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే జగన్మోహన రెడ్డి హైకమాండ్‌కు అనుకూలంగా ఉంటే, మరో మూడేళ్ళు జగన్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జగన్‌కు శ్రేయోభిలాషులు సూచిస్తున్నట్లు తెలిసింది.

0 comments:

Post a Comment