Thursday

ఓదార్పుపై సోనియా మాటలు వక్రీకరించారు: పురంధేశ్వరి

వై. ఎస్ .ఆర్ జిల్లా ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలమేనని, ఈ యాత్రపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని విశాఖ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు. ఆమె గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన కుటుంబాలను ఓదార్చాలని సోనియా గాంధీ కోరుకున్నారన్నారు. అయితే అదీకూడా కాంగ్రెస్ పార్టీ పరంగా జరగాలని, మరణించిన కుటుంబాలవారికి పార్టీ తరపున ఆర్థిక సాయం చేయాలని ఆమె చెప్పారని పురంధేశ్వరి తెలిపారు. అయితే ఈ విషయంలో తన మాటలు వక్రీకరించినట్టు సోనియా గాంధీ చెప్పారని పురంధేశ్వరి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సాగిస్తున్న యాత్రలో పాల్గొనవద్దని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు అహ్మద్ పటేల్‌ చెప్పారని పురంధేశ్వరి ధృవీకరించారు.

0 comments:

Post a Comment