Friday

చంద్రబాబు గుంట నక్కలా ఉన్నారు: పొన్నం ప్రభాకర్




 ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంట దగ్గర నక్కలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యమని, వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునివ్వడం పట్ల పొన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. స్థాయికి తగినట్టుగా నడుచుకోవాలని హితవు పలికారు. అలాగే, రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలన్నారు. లేనిపక్షంలో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారన్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే, వీటిని పరిష్కరించుకునే సత్తా తమకు ఉందన్నారు. అంతేకానీ, ఈ కలహాలను బూచీగా చూపి మధ్యంతర ఎన్నికలు వస్తాయని ప్రజలను అయోమయానికి గురి చేయడం ఆయనకు తగదన్నారు.

0 comments:

Post a Comment