Thursday

మంత్రి పదవి ఊడినా ఫర్వాలేదు.. జగన్ సీఎం కావాలంతే


"వైఎస్సారే లేనప్పుడు నాకు ఆ మంత్రి పదవి ఎందుకు..? దానిని వదిలేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అంటూ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఓదార్పులో భారీ జనసందోహాన్ని చూసిన బాలినేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. 

ఆ ఆనందంలో తనకు మంత్రి పదవి ముఖ్యం కాదనీ, జగన్‌ను సీఎంగా చూడటమే తనకు చాలని అన్నారు. అశేష ఆంధ్ర ప్రజల మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు. 

కాగా వైఎస్ జగన్ సొంత కుంపటి ఏర్పాటు చేసుకుంటే భారీ మెజారిటీతో ఆయనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఓదార్పు యాత్రకు హాజరవుతున్న ప్రజలు చెపుతున్నారు. ఈ వార్తలు ఓదార్పుకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. మరి భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

0 comments:

Post a Comment