Sunday

అన్ని వర్శిటీలలో సమైక్యాంధ్ర జెండావిష్కరణ: సీమాంధ్ర

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో సమైక్యాంధ్ర జెండాలను ఆవిష్కరించాలని సీమాంధ్ర ప్రాంత విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు హైకోర్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు సృష్టించిన హంగామాకు నిరసనగా వచ్చే 21వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ అంశంపై సీమాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ కృష్ణయాదవ్ ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ న్యాయవాదులు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. న్యాయదేవత సాక్షిగా అన్యాయానికి పాల్పడే న్యాయవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీటన్నింటికి నిరసనగా వచ్చే 21వ తేదీన సీమాంధ్రలోని అన్ని వర్శిటీలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే, 22వ తేదీన వర్శిటీలలో సమైక్యాంధ్ర జెండాలను ఆవిష్కరిస్తారమని చెప్పారు. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వైఖరి తెలంగాణ ప్రాంతానికి మద్దుతుగా ఉందని ధ్వజమెత్తారు.

0 comments:

Post a Comment