Sunday

ప్రరాపా కార్యాలయ గేటు కీపర్‌ను మాత్రమే: అల్లు అరవింద్

తాను పార్టీ ప్రధాన కార్యాలయ గేటు కీపర్‌ను మాత్రమేనని ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని చెప్పారు. అల్లు అరవింద్‌ను తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రరాపా ప్రధాన కార్యాలయం శనివారం ఒక పత్రిక ప్రకటన ద్వారా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రరాపా నేతలు కార్యకర్తలు ప్రత్యేక బహుమతిని ఈ రూపంలో ఇచ్చారన్నారు. ఇకపోతే.. పార్టీలో తన పాత్ర గురించిన ప్రశ్నించగా, పార్టీలో గేటు కీపర్‌ననే విషయం తనకు ఎల్లపుడూ గుర్తుంటుందన్నారు. ఈ విషయాన్ని మాత్రం విస్మరించకుండా, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతానన్నారు. అయితే, మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. అల్లు అరవింద్ నియామకంపై రాజకీయ విశ్లేషకులు మరోలా స్పందిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి అల్లు అరవింద్ నియామకం ఎంతగానే బలం చేకూర్చుతుందన్నారు. అలాగే, పార్టీలో గంటా శ్రీనివాసరావు వంటి అగ్రనేతలకు కీలక పదవులను కేటాయించాలని వారు అభిప్రాయపడ్డారు.

0 comments:

Post a Comment