Sunday

వైఎస్ఆర్ పథకాలు ఈ దేశానికే ఆదర్శం: వైఎస్.జగన్


దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ దేశానికే ఆదర్శమని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ప్రకాశం జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం దర్శిలో వైఎస్ఆర్ విగ్రాహాన్ని భారీ జనసందోహం మధ్య ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని వైఎస్ఆర్ ఈ దేశ రాజకీయ నేతలకు చూపించారన్నారు. మహానేత ప్రవేశపెట్టిన పథకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా ఈ దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అయితే, వైఎస్ఆర్ చనిపోయి యేడాది గడుస్తున్నా ఆయనపై రాజకీయ విమర్శలు మాత్రం ఇంకా తగ్గలేదన్నారు. 

కొందరు నేతలు ఆయనపై బురద జల్లేదుకు ప్రయత్నించే హీనస్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కోట్లాది మంది ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, అప్యాయతల ముందు ఇవన్నీ కొట్టుకుని పోతాయన్నారు. 

వైఎస్ భౌతికంగా మాత్రమే మనకు దూరమయ్యారే గానీ, ప్రతి ఒక్కరి గుండెలో స్థిరస్థాయిగా గూడుకట్టుకుని ఉన్నారన్నారు. వైఎస్‌పై ఏ విధంగా ప్రేమాభిమానాలు చూపారో అదేరీతిలో తనపై చూపుతున్నందుకు ప్రతి ఒక్కరికీ జగన్ కృతజ్ఞలు తెలిపారు.

0 comments:

Post a Comment