Sunday

విభేదాలు ముదిరితే తెలంగాణ నీరుగారిపోతుంది: కేకే

తెలంగాణ ప్రాంతంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన చెందిన నేతల మధ్య ఉన్న విభేదాలు ముదిరితే తెలంగాణ అంశం మరుగునపడిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కే.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసీ) అవసరం లేదన్నారు. కావాల్సిందల్లా అన్ని పార్టీలకు చెందిన నేతలంతా సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఇందుకోసం ఆయా పార్టీల నేతలతో మాట్లాడడానికి తాను సిద్ధమని కేకే ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం పోరాడుతున్న పార్టీలన్నీ చిన్నచిన్న విభేదాలతో కలహించుకోవడం తగదని హితవు పలికారు. ఈ విభేదాలు, కలహాలు తారా స్థాయికి చేరితే తెలంగాణ ఉద్యమం నీరుగారి పోతుందన్నారు. లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

0 comments:

Post a Comment