Wednesday

పావురాలగుట్టపై వైఎస్ విగ్రహావిష్కరణ: మంత్రి దానం


హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుని ప్రజానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తుదిశ్వాస విడిచిన పావురాలగుట్టపై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటాని బుధవారం దానం విలేకరులకు చెప్పారు. 

ఇదిలావుండగా, స్వల్ప అస్వస్థకు లోనైన ముఖ్యమంత్రి రోశయ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. ఆయనకు స్వల్పంగా జ్వరం ఉందని అందువల్లే ప్రధాని తిరుపతి పర్యటనకు దూరంగా ఉన్నారని చెప్పారు. ఈ రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకుని గురువారం పావురాలగుట్టకు చేరుకుని వైఎస్ విగ్రాహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు.

0 comments:

Post a Comment